బిగ్ బ్రేకింగ్.. పుట్ట మధును వదిలేసిన పోలీసులు..!

by  |
బిగ్ బ్రేకింగ్.. పుట్ట మధును వదిలేసిన పోలీసులు..!
X

దిశ, వెబ్‌డెస్క్: లాయర్ వామన్‌రావు దంపతుల హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు ప్రమేయం ఉందని వామన్‌రావు తండ్రి ఫిర్యాదు చేయగా.. అజ్ఞాతంలో ఉన్న మధును పోలీసులు భీమవరంలో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రామగుండం కమిషనరేట్‌కు తీసుకొచ్చి మూడు రోజుల పాటు కేసుకు సంబంధించి పలు అంశాలపై విచారించారు. ఈ నేపథ్యంలోనే విచారణ ముగిసిన అనంతరం పోలీస్ కస్టడీ నుంచి సోమవారం అర్ధరాత్రి పుట్ట మధును ఇంటికి పంపారు. ఇదే సమయంలో తిరిగి విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌‌గా మారింది. అయితే, గత మూడు రోజుల విచారణలో బలమైన సాక్ష్యాలు బయటకు రానట్టు తెలుస్తోంది. రూ. 2 కోట్ల ఆర్థిక లావాదేవిలపై కూడా ఇప్పటివరకు ఎటువంటి ఆధారం లభ్యం కాలేదని చర్చించుకుంటున్నారు.


Next Story