- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: లాయర్ వామన్రావు దంపతుల హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు ప్రమేయం ఉందని వామన్రావు తండ్రి ఫిర్యాదు చేయగా.. అజ్ఞాతంలో ఉన్న మధును పోలీసులు భీమవరంలో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రామగుండం కమిషనరేట్కు తీసుకొచ్చి మూడు రోజుల పాటు కేసుకు సంబంధించి పలు అంశాలపై విచారించారు. ఈ నేపథ్యంలోనే విచారణ ముగిసిన అనంతరం పోలీస్ కస్టడీ నుంచి సోమవారం అర్ధరాత్రి పుట్ట మధును ఇంటికి పంపారు. ఇదే సమయంలో తిరిగి విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. అయితే, గత మూడు రోజుల విచారణలో బలమైన సాక్ష్యాలు బయటకు రానట్టు తెలుస్తోంది. రూ. 2 కోట్ల ఆర్థిక లావాదేవిలపై కూడా ఇప్పటివరకు ఎటువంటి ఆధారం లభ్యం కాలేదని చర్చించుకుంటున్నారు.