భ‌ద్రాచ‌లంలో భారీగా గంజాయి ప‌ట్టివేత‌

by  |
భ‌ద్రాచ‌లంలో భారీగా గంజాయి ప‌ట్టివేత‌
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భ‌ద్రాచ‌లం ఫారెస్ట్ చెక్‌పోస్టు వ‌ద్ద పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో కారులోని 27 కేజీల గంజాయి, ఐచర్ కంటైనర్‌లోని 609 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న‌ట్టు ఏఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు.

మొత్తం 637 కేజీల గంజాయి లభ్యమైంద‌ని అన్నారు. మార్కెట్లో దీని విలువ సుమారుగా రూ.95 లక్షల 60 వేలు ఉంటుందని తెలిపారు. నిందితులు నరేష్ కుమార్, ముకేశ్ కుమార్, భల్వీర్, జితేందర్ శర్మల‌ను అరెస్ట్ చేసిన‌ట్టు తెలిపారు. న‌లుగురు నిందితులు రాజ‌స్థాన్‌కు చెందిన వారే కావ‌డం గ‌మ‌నార్హం.

Next Story