ప్రభుత్వ టీచర్ కిడ్నాప్‌‌కు యత్నం.. వెంబడించిన పోలీసులు!

by  |
ప్రభుత్వ టీచర్ కిడ్నాప్‌‌కు యత్నం.. వెంబడించిన పోలీసులు!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఓ వ్యక్తిని కిడ్నాప్‌ చేసేందుకు యత్నించడం కలకలం రేపింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మెహర్ తాజ్‌ను కిడ్నాపర్ పురుషోత్తం ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని వెంబడించి మరి పట్టుకున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో అనుమానితుడు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలాఉండగా, గతంలోనూ మెహర్ తాజ్‌ను కిడ్నాప్ చేసేందుకు పురుషోత్తం యత్నించినట్లు సమాచారం. కాగా, ప్రభుత్వ టీచర్‌ను కిడ్నాపర్ ఎందుకు ఎత్తుకెళ్లడానికి రెండు మార్లు ప్రయత్నించాడు. వ్యక్తిగత గొడవలు ఏమైనా ఉన్నాయా? లేక ఆర్థిక వ్యవహరాలే కారణామా? అనేది ఇంకా తెలియరాలేదు.

Next Story