7 నిమిషాల్లో ప్రాణాలు కాపాడిన పోలీసులు

by  |
7 నిమిషాల్లో ప్రాణాలు కాపాడిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏడు నిమిషాల్లో నిండు ప్రాణాలను కాపాడి తల్లి వద్దకు కొడుకును చేర్చారు పోలీసులు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరులో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే.. ఓ వ్యక్తి తన కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలో బంధువులకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని.. ఉరి వేసుకుంటున్నానని వీడియో తయరు చేసి సమాచారం అందించాడు. దీంతో అతడి తల్లి, మిత్రుడు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన చెన్నూరు సీఐ ప్రమోద్ రావు , ఎస్ఐ శివ కుమార్ బృందం.. సదర వ్యక్తి ఫోన్ ట్రేస్ చేసి ఏడు నిమిషాలలో పట్టుకొని నిండు ప్రాణాలను కాపాడి తన తల్లి వద్దకు చేర్చారు. దీంతో వ్యక్తి కుటుంబసభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.



Next Story

Most Viewed