పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

by  |
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు
X

దిశ, రంగారెడ్డి: పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేసి ఇద్దరి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గు పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకీర్యాల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ శివారులోని బహిరంగ ప్రదేశాల్లో కొంతమంది పేకాటరాయుళ్లు పేకాట అడుతుండగా విశ్వసనీయ సమాచారం మేరకు కొందుర్డు పోలీసులు దాడులు చేశారు. ఈ క్రమంలో వారిని దూరం నుంచి గమనించిన పేకాటరాయుళ్లు పరారయ్యారు. స్థావరం వద్ద వదిలేసి వెళ్లిన ఇద్దరి సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Tags: Police, raid, poker bases, rangareddy, kondurg, mobiles


Next Story

Most Viewed