- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, జవహర్ నగర్: జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్కాలు విక్రయిస్తున్న షాపులపై సీఐ భిక్షపతిరావు ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి రైడింగ్ నిర్వహించారు. ప్రభుత్వం నిషేధించిన గుట్కా ప్యాకెట్లు జనరల్ స్టోర్(కిరాణా దుకాణాలు)లలో అమ్ముతున్నారనే సమాచారంతో సీఐ భిక్షపతిరావు తన సిబ్బందితో కలిసి జవహర్ నగర్ కార్పొరేషన్, యాప్రాల్, దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని పాన్, కిరాణా దుకాణాలపై దాడి చేసి రూ. 60 వేల విలువ గల 180 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 24 మంది దుకాణ యజమానులపై కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ప్రభుత్వం నిషేధించిన గుట్కా, గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
Next Story