వినూత్న ఘటన.. ఫిర్యాదు పత్రాలు ఇస్త్రీ

by  |
వినూత్న ఘటన.. ఫిర్యాదు పత్రాలు ఇస్త్రీ
X

దిశ, కోదాడ: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి, వచ్చిన ప్రతి ఫిర్యాదు దారుడు ప్రతులను ఇస్త్రీ ద్వారా హీట్ చేసి ఇవ్వాలని ఓ పీఎస్ వినూత్నంగా అవగాహన కల్పించారు. ఈ విషయాన్ని డీఎస్‌పీ రఘు శుక్రవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ నివారణ చర్యలో భాగంగా నల్లగొండ కోదాడ సబ్ డివిజనల్ పోలీసు అధికారి కార్యాలయంలో డీఎస్పీ రఘు ఫిర్యాదు దారుల నుంచి స్వీకరించే పత్రాల ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున, అధిక ఉష్ణోగ్రత వద్ద కరోనా వైరస్ చనిపోయే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తగా ఆ ఫిర్యాదు పత్రాలను ఇస్త్రీ పెట్టె ద్వారా హీట్ చేసి, పత్రాలు స్వీకరించి ఫిర్యాదు దారుల సమస్యలు పరిష్కరిస్తున్నారు.

Next Story