తంబాకు ఉత్పత్తులు స్వాధీనం

by  |
తంబాకు ఉత్పత్తులు స్వాధీనం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంత్ నగర్‌లో ఒక గోడౌన్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం దాడి చేసారు. ఈ దాడుల్లో రూ.6.30 లక్షల విలువైన తంబాకు, ఖైని, జర్ధా ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోదాం యజమాని చకిలం భాస్కర్ పై కేసు నమోదు చేసినట్టు టాస్క్ ఫోర్స్ సీఐ షాకీర్ అలీ తెలిపారు. స్వాధీనం చేసుకున్న తంబాకు ఉత్పత్తులతో పాటు నిందితుడిని రూరల్ పోలీసులకు అప్పగించారు.



Next Story

Most Viewed