నకిలీ దాణా దందా.. గుట్టు రట్టు చేసిన ఎస్పీ..

by  |
నకిలీ దాణా దందా.. గుట్టు రట్టు చేసిన ఎస్పీ..
X

దిశ, సూర్యాపేట కలెక్టరేట్: కల్తీ చేపల దాణా తయారీ ముఠాల పై సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఉక్కుపాదం మోపారు. ఏక కాలంలో సూర్యాపేట చివ్వేంల కోదాడ లలో నకిలీ దాణా తయారీ కేంద్రాల పై దాడులు నిర్వహించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా ఎస్పి మాట్లాడుతూ.. చేపల దాణా లో తౌడు రూపంలో సున్నపు రాయి మిశ్రమంతో కల్తీకి పాల్పడుతున్న నలుగురు కేటుగాళ్ళు అరెస్ట్ చేశామన్నారు.

66 qntl నక్కలీ దాణా 62 qntl సున్నపు రాయి మిశ్రమం స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడుల్లో పాల్గొన్న పోలీసు సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రీతి రాజ్, డిఎస్పీ లు మోహన్ కుమార్ రఘు, ఇన్స్పెక్టర్లు నరసింహ ఆంజనేయులు, నరసింహారావు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.


Next Story

Most Viewed