పోలీసుల అదుపులో కిడ్నాపర్లు.. బాలిక సురక్షితం

by  |
Anantapur-Police
X

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా కదిరి వాణివీధిలో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. ఆరుగురు వ్యక్తులు అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి, తల్లిదండ్రులను బంధించి బాలికను కిడ్నాప్ చేశారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ధర్మవరం వద్ద కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించి నిందితులకు కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, కిడ్నాప్‌కు ప్రేమ వ్యవహారమే కారణం అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed