బెంగాల్‌లో బంగారం దొంగలు అరెస్ట్

by  |
బెంగాల్‌లో బంగారం దొంగలు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ సిలిగురిలో అక్రమంగా బంగారం తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ తనిఖీల్లో డీఆర్‌ఐ అధికారులు 1.99 కిలోల గోల్డ్‌ను స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని తరలిస్తున్న మంగిలాల్, యోగేష్ అనే నిందితులను అరెస్ట్ చేశారు.

అయితే, నిందితులు రాజస్థాన్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ నుంచి బంగారాన్ని ఢిల్లీకి తరలిస్తున్నారు. ఈ తరుణంలో పశ్చిమ బెంగాల్‌లో పోలీసుల కంటబడ్డారు. కాగా, పట్టుబడ్డ బంగారం విలువ రూ. 2 కోట్ల ఉంటుందని డీఆర్ఐ అధికారులు తెలిపారు. మొత్తం 12 గోల్డ్ బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ అధికారులు వివరణ ఇచ్చారు.

Next Story

Most Viewed