ఆదివాసీలకు దుప్పట్లు పంపిణీ చేసిన పోలీసులు

by  |
ఆదివాసీలకు దుప్పట్లు పంపిణీ చేసిన పోలీసులు
X

దిశ, దుమ్ముగూడెం: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని ఆదివాసీల సంక్షేమమే పోలీసుల ప్రధాన ధ్యేయమని భద్రాచలం ఏఎస్పీ అక్షాంశ్ యాదవ్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఆదేశాల మేరకు దుమ్ముగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ములకనపల్లిలోని 90 ఆదివాసీ కుటుంబాలకు ఏఎస్పీ అక్షాంశ్ యాదవ్ చేతుల మీదుగా దుప్పట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ అక్షాంశ్ యాదవ్ మాట్లాడుతూ.. చలి తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు ఉపయోగపడే విధంగా ఈ దుప్పట్లను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లా ఎస్పీ సునీల్ దత్ సారథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసిశిస్తున్న ఆదివాసీ గిరిజనుల కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపడతామని తెలియజేశారు.

Next Story

Most Viewed