మాజీ మంత్రి కిడ్నాప్.. దాచిపెట్టిన పోలీసులు

by  |
మాజీ మంత్రి కిడ్నాప్.. దాచిపెట్టిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక మాజీ మంత్రి ప్రకాశ్‌ను ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారులోనే కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన కవిరాజ్‌ను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కవిరాజ్‌ తమిళనాడుకు చెందిన డాన్ రవి పూజారికి ప్రధాన అనుచరుడిగా పోలీసులు గుర్తించారు. గత నెల నవంబర్ 25న మాజీ మంత్రి ప్రకాశ్‌ను కిడ్నాప్ చేసిన నిందితుడు.. రూ.48 లక్షల వసూలు చేశాడు. కిడ్నాప్ చేసిన మూడు రోజులకు ప్రకాశ్‌ను విడుదల చేశారు. అయితే నిందితులు మంత్రిని విడుదల చేసేవరకూ పోలీసులు కిడ్నాప్ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచారు.



Next Story

Most Viewed