పొందుగల బ్రిడ్జి వద్ద తనిఖీలు.. నలుగురు అరెస్ట్

by  |

అమరావతి: ఏపీలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన యువకులను పోలీసులు అరెస్టు చేశారు. తనిఖీల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున గుంటూరు జిల్లాలోని పొందుగల బ్రిడ్జి వద్ద ఓ పాల వ్యాన్‌ను ఆపగా, అందులో ముగ్గురు యువకులు ఏపీలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో డ్రైవర్ సహా ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. లారీని సీజ్ చేశారు. కాగా, సదరు యువకులు హైదరాబాద్ నుంచి సింగరాయకొండకు వెళ్తున్నట్టు తెలిపారు.

Tags : Police checks, pondugala bridge, arrest, three members, guntur, milk van


Next Story

Most Viewed