మావోయిస్టుల అలజడి.. డాగ్ స్క్వాడ్లతో పోలీసుల తనిఖీలు..

by  |
Dog-Squad
X

దిశ, కాటారం : మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేస్తున్నది. మహాదేవపూర్, మహా ముత్తారం, పలిమెల మండలాల గోదావరి పరివాహక ప్రాంతాల్లో మావోయిస్టులు తెలంగాణలోకి చొరబడే అవకాశాలు ఉన్నందున ఓవైపు వాహన తనిఖీలు, మరోవైపు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

పలిమెల మండలంలో గురువారం బీడీటీం, డాగ్ స్క్వాడ్లతో పలిమెల ఎస్ఐ శ్యామ్ రాజ్ ఆధ్వర్యంలో అడవుల్లో తనిఖీలు, రోడ్డుకు ఇరువైపుల కల్వర్టుల వద్ద ప్రత్యేక గాలింపు చర్యలు నిర్వహించారు.


Next Story