కర్నూలు జిల్లాలో భారీగా నగదు పట్టివేత

by  |
కర్నూలు జిల్లాలో భారీగా నగదు పట్టివేత
X

దిశ ఏపీ బ్యూరో: తమిళనాడులోని తిరువళ్లూరు వద్ద మంత్రి బాలినేని స్టిక్కర్‌తో బంగారం వ్యాపారికి చెందిన ఒంగోలు కారులో 5.27 కోట్ల రూపాయలు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ వివాదం సద్దుమణగకముందే కర్నూలు జిల్లా పాణ్యం మండలం చాపిరేవుల టోల్ ప్లాజా వద్ద ఓ కారులో 1 కోటి 80 వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు ఈ కారు వెళ్తున్నట్టు గుర్తించారు. ఈ నగదుకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో దీనిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, కారును సీజ్ చేసి, కేసు నమోదు చేశారు.



Next Story

Most Viewed