గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి పై కేసు నమోదు

by  |
గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి పై కేసు నమోదు
X

దిశ,నిజామాబాద్: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని పెద్దగుల్ల శివారులో ఓ రైతు ఒక ఎకరం పంట పొలం గంజాయిని మిశ్రమ సాగు చేశాడని తహశీల్దార్ వెంకటేష్ గారికి పక్క సమాచారం అందింది. శనివారం తహశీల్దార్, ఎస్. ఐ రఫియోద్దీన్ పంట పొలాన్ని పరిశీలించగా,గంజాయి సాగు చేస్తున్నట్టు గుర్తించి అబ్కారీ శాఖకు సమాచారం అందించారు.అబ్కారీ ఎస్. ఐ జనార్దన్ ఆ గ్రామానికి చేరుకుని 114 గంజాయి మొక్కలను కాల్చివేశారు, అనంతరం గంజాయిని సాగు చేస్తున్న షట్కార్ హన్మంత్ రావు మీద కేసు నమోదు చేసినట్లు తెలిపారు అధికారులు. గంజాయి 35,000 విలువ ఉంటుంది అనీ ఆబ్కారీ ఎస్. ఐ జనార్దన్ పేర్కొన్నారు



Next Story