- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, కూకట్పల్లి: బోరబండ నుంచి మియాపూర్ వైపు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు కేపీహెచ్బీ పోలీసులు శనివారం ఓ లారీని అందులో బియ్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకుని రిమాండ్కు తరలించారు. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం బోరబండ నుంచి మియాపూర్ వైపు ఓ లారీలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం అందటంతో కేపీహెచ్బీ కానిస్టేబుల్ రవి నాయక్, మురళిలు కేపీహెచ్బీ కాలనీలో లారీని ఆపి తనిఖీ చేయగా అందులో 18 టన్నుల 8 కింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్టు తెలిసింది.
లారీలో బియ్యం తరలిస్తున్న డ్రైవర్ బాబా పటేల్(28), క్లీనర్ అహ్మద్ మియా(33)లను పోలీసులు అదుపులో తీసుకున్నారు. బోరబండ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజల నుంచి బియ్యం కొనుగోలు చేసి వాటిని కర్ణాటకకు తరలించి అక్కడ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సీఐ తెలిపారు.