రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు

by  |
biyyam
X

దిశ, కూకట్‌పల్లి: బోరబండ నుంచి మియాపూర్​ వైపు రేషన్​ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు కేపీహెచ్‌బీ పోలీసులు శనివారం ఓ లారీని అందులో బియ్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకుని రిమాండ్​కు తరలించారు. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం బోరబండ నుంచి మియాపూర్​ వైపు ఓ లారీలో రేషన్​ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం అందటంతో కేపీహెచ్​బీ కానిస్టేబుల్​ రవి నాయక్​, మురళిలు కేపీహెచ్​బీ కాలనీలో లారీని ఆపి తనిఖీ చేయగా అందులో 18 టన్నుల 8 కింటాళ్ల రేషన్​ బియ్యాన్ని తరలిస్తున్నట్టు తెలిసింది.

లారీలో బియ్యం తరలిస్తున్న డ్రైవర్​ బాబా పటేల్​(28), క్లీనర్​ అహ్మద్ మియా(33)లను పోలీసులు అదుపులో తీసుకున్నారు. బోరబండ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజల నుంచి బియ్యం కొనుగోలు చేసి వాటిని కర్ణాటకకు తరలించి అక్కడ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సీఐ తెలిపారు.



Next Story

Most Viewed