చిరుత చర్మం స్మగ్లింగ్.. ముగ్గురు అరెస్ట్

by  |
చిరుత చర్మం స్మగ్లింగ్.. ముగ్గురు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో చిరుత చర్మం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ముగ్గురు నిందితులను ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల నుంచి చిరుతపులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సున్నిపెంట, దోర్నాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



Next Story

Most Viewed