15 మంది అరెస్టు.. 77 బైకులు స్వాధీనం

by  |
15 మంది అరెస్టు.. 77 బైకులు స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో బైకు దొంగతనాలకు పాల్పడుతున్న మూడు ముఠాలను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీ అంజనీ కుమార్ వివరాల ప్రకారం.. మొత్తం ఈ మూడు ముఠాల నుంచి దాదాపు 15 మందిని అరెస్టు చేశామని అన్నారు. అనంతరం వారి నుంచి రూ.కోటి విలువైన 77 బైక్‌లను స్వాధీనం చేస్టుకున్నట్టు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రతిఒక్కరూ తమ ఏరియాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అప్పుడే ఈ దొంగతనాలను నియంత్రించవచ్చునని అన్నారు. సీసీ కెమెరాలు ఉంటే దొంగతనం జరిగినప్పుడు త్వరగ కేసులు ఛేదించడానికి వీలుగా ఉంటుందని తెలిపారు.



Next Story

Most Viewed