- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: తన భర్త బంధువుతో వివాహేతర సంబంధం కొనసాగించడమే కాకుండా, ఇదేంటని ప్రశ్నించిన భర్తను హత్య చేసింది ఓ మహిళ. ఈ కేసులో ప్రియుడితోపాటు ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లో నివసించే హారూన్- నర్గిస్ భార్యాభర్తలు. హారూన్ కారు డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలో సమీప బంధువైన సమీర్ హారూన్ వద్దకు కారు డ్రైవింగ్ నేర్చుకునేందుకు అప్పుడప్పుడు వచ్చేవాడు. సమీర్ పై హారూన్ భార్య నర్గిస్ మనసు పారేసుకుంది. హారూన్ అందంగా లేకపోవడంతో అతనంటే ఆమెకు అస్సలు ఇష్టముండేదికాదు. ఒకరోజు సమీర్ కు విషయం చెప్పింది. అతను కూడా అందుకు ఓకే అన్నాడు. దీంతో వీరిద్దరు ప్రేమికులుగా మారారు. హారూన్ లేని సమయంలో వీరిద్దరూ కలుసుకునేవాళ్లు. అయితే, కొన్ని రోజుల తర్వాత హారూన్ కు విషయం తెలిసి నిలదీశాడు. దీంతో ఆమె అతని పట్ల దురుసుగా ప్రవర్తించేది. ఈ సందర్భంలో సమీర్ ను హారూన్ ఇంటికి రావొద్దని చెప్పాడు.
దీంతో తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని హారూన్ ను హత్య చేయాలని ప్లాన్ వేశారు. అనుకున్నట్టుగానే సమీర్.. తన ఇంటి వద్ద ప్రత్యేక విందు కార్యక్రమం ఉంది, రావాలి అని హారూన్ ను ఆహ్వానించాడు. సమీర్ ఇంటికి వెళ్లిన హారూన్ ను తీవ్రంగా కొట్టి చంపేశారు. అనంతరం అతడి మృతదేహాన్ని అడవిలో పడేశారు. ఆ తర్వాత నర్గిస్ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులకు హారూన్ ఫోన్ కాల్స్ పై ఎంక్వైరీ చేయగా చివరి కాల్ సమీర్ నుంచి రావడంతో అతడిని విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో వారిద్దరిని అరెస్ట్ చేశారు.
- Tags
- Arrest