బెట్టింగ్ గ్యాంగ్ కు..బేడీలు…

by  |
బెట్టింగ్ గ్యాంగ్ కు..బేడీలు…
X

దిశ, భువనగిరి: ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ వేస్తున్న టీమ్ ను అరెస్ట్ చేసి నగదుతో పాటు బైక్, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ శనివారం విలేఖరుల ముందు ప్రకటించారు. చెన్నయ్ సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య శుక్రవారం జరుగుతున్నక్రికెట్ మ్యాచ్ పై ఆన్ లైన్ లో బెట్టింగ్ చేస్తున్న నలుగురు యువకులను భువనగిరి ఎస్వోటి, రాచకొండ పోలీసులు, పట్టణ పోలీసులు సంయుక్తంగా మెరుపుదాడి చేసి పట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

హుస్నాబాద్ కు చెందిన మంద శివకుమార్ రెడ్డి, ఆకుల నరేష్, మండవ వినయ్ లతోపాటు కొత్త జాని భువనగిరిలోని తారకరామనగర్ కు చెందినవారుగా పోలీసులు తెలిపారు. ఈజీ మనీకి అలవాటు పడ్డ వీరు డబ్బులు సంపాదించాలని ఆశతో ఆన్ లైన్ లో క్రికెట్ బెట్టింగ్ కు సిద్ధపడ్డారని, సమాచారం తెలుసుకున్న మా సిబ్బంది ఈ నెల 16 న రాత్రి వారిపై రెక్కీ నిర్వహించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి నుంచి రూ.60 వేల నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక మోటార్ బైక్ స్వాదీనం చేసుకున్నామని మహేష్ భగవత్ తెలిపారు. రెక్కీలో పాల్గొన్న టీమ్ ను ఆయన అభినందించారు.

Next Story