విశాఖలో శిరోముండనం కేసుపై విచారణ

by  |
విశాఖలో శిరోముండనం కేసుపై విచారణ
X

దిశ, ఏపీ బ్యూరో: విశాఖలో శ్రీకాంత్ అనే యువకుడి శిరోముండనం కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీ కోరారు. నూతన్‌నాయుడు భార్య మధు ప్రియతో పాటు, మరో ఇద్దరిని రెండ్రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. పెందుర్తిలో దళిత యువకుడు శ్రీకాంత్ శిరోముండనం కేసులో నిర్మాత, నటుడు, బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడుని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నూతన్ నాయుడు భార్య మధుప్రియతో పాటు ఇందిరా, ఝాన్సీ, సౌజన్య, రవి, బాలు, వరహాలుపై కేసులు నమోదయ్యాయి.


Next Story

Most Viewed