PNB :ఆ ఖాతాల నుంచే పీఎన్‌బీకి రూ. 170 కోట్ల ఆదాయం..

by  |
bank
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) 2020-21 ఆర్థిక సంవత్సరంలో వినియోగదారులు ఖాతాల్లో కనీస మొత్తాన్ని నిర్వహించనందుకు సుమారు రూ. 170 కోట్ల ఛార్జీలను వసూలు చేసింది. పీఎన్‌బీ బ్యాంకు ఛార్జీల రూపంలో వసూలు చేసిన ఆదాయంపై ఆర్‌టీఐ ద్వారా దరఖాస్తు చేసుకోగా బ్యాంకు వివరాలను వెల్లడించింది. వినియోగదారుల ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేని కారణంగా పీఎన్‌బీ అంతకుముందు 2019-20లో రూ. 286.24 కోట్లను వసూళ్లతో పోలిస్తే ఈసారి తగ్గాయి.

అలాగే, ఏటీఎం లావాదేవీ ఛార్జీల ద్వారా 2020-21లో రూ. 74.28 కోట్ల ఆదాయం సాధించగా, అంతకుముందు 2019-20లో రూ. 114.08 కోట్లను వసూలు చేసింది. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో బ్యాంకు ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలను మినహాయించినట్టు పీఎన్‌బీ పేర్కొంది. ఈ కారణంగానే బ్యాంకు ఆదాయం తగ్గినట్టు అభిప్రాయపడింది.


Next Story