రేపు అఖిల భారత మేయర్లతో సమావేశం… ప్రారంభించనున్న ప్రధాని

by  |
రేపు అఖిల భారత మేయర్లతో సమావేశం… ప్రారంభించనున్న ప్రధాని
X

లక్నో: న్యూ అర్భన్ ఇండియా థీమ్‌తో సాగే అఖిల భారత మేయర్ల సదస్సును ప్రధాని శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో దేశంలో అన్ని రాష్ట్రాలకు చెందిన మేయర్లు పాల్గొనున్నారు. పట్టణ ప్రాంతాలలో జీవన సౌలభ్యాన్ని నిర్ధారించడానికి, శిథిలావస్థలో ఉన్న పట్టణ మౌలిక సదుపాయాలు, సౌకర్యాల లేమి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం అనేక పథకాలు కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావించనున్నారు. దీంతో పాటు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు పట్టణాభివృద్ధి రంగంలో కేంద్ర ప్రభుత్వం, యూపీ సాధించిన అభివృద్ధిని ప్రదర్శించనున్నారు.


Next Story

Most Viewed