గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇలాగే చేస్తున్నా : ప్రధాని మోడీ

by  |
mODI-222
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూకాశ్మీర్ లో పర్యటించారు. నౌషేరాలో భారత జవాన్లతో కలిసి ఆయన దీపావళి వేడుకలు జరుపుకున్నారు. మొదటగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు ఆయన నివాళులర్పించారు. అనంతరం ఆయన జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. జవాన్లతో దీపావళి వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి తాను దీపావళి పండుగను సైనికులతోనే జరుపుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ‘భారత జవాన్లు శత్రువులకు ధీటైన జవాబు ఇస్తున్నారు. భద్రతా బలగాలే నా కుటుంబం. నేనొక్కడినే ఇక్కడికి రాలేదు.. 130 కోట్ల భారతీయుల ప్రతినిధిగా మీ వద్దకు వచ్చా’ అంటూ మోడీ ప్రసంగించారు.

Modi-1


Next Story

Most Viewed