రాత్రి 8 గంటలకు పీఎం ప్రసంగం

by  |
రాత్రి 8 గంటలకు పీఎం ప్రసంగం
X

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. కరోనా వైరస్ (కోవిడ్ 19) మహమ్మారికి సంబంధించిన విషయాలపై ఆయన ప్రసంగించనున్నారు. లాక్ డౌన్ ను చాలామంది సీరియస్ గా తీసుకోవడం లేదని, అందరూ ఇంట్లో ఉండి ఆదేశాలను పాటించాలని నిన్న ప్రధాని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. గురువారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఆదివారం నాడు జనతా కర్ఫ్యూ పాటించాలని సూచించారు. సోమవారం నుంచి దాదాపుగా దేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లిన సంగతి తెలిసింది.

Tags: PM, modi, speech, nation, covid 19, lockdown


Next Story

Most Viewed