రైతు సంఘాలతో చర్చలకు సిద్ధం : మోడీ

by  |
రైతు సంఘాలతో చర్చలకు సిద్ధం : మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్ : రైతు సంఘాల నాయకులతో చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు స్పష్టం చేశారు. శనివారం అఖిలపక్ష సమావేశంలో భాగంగా వ్యవసాయ చట్టాలపై రైతు ఆందోళనలను పరిగణలోనికి తీసుకోవాలని ప్రతిపక్ష, విపక్షాలు ప్రధానికి విజ్ఞప్తి చేశాయి.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. సాగు చట్టాలపై రైతు సంఘాల నాయకులతో చర్చించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ప్రకటించారు. రైతులకు కోసం కేంద్రం ఇచ్చిన ఆఫర్ ఇప్పటికీ వర్తిస్తుందన్నారు. అంతేకాకుండా రైతు సమస్యలకు చర్చలతోనే పరిష్కారం లభిస్తుందని, ఆందోళనలతో ఎప్పటికీ పరిష్కారం లభించదని తెలిపారు.

Next Story