కేరళకు పీఎం మోడీ ప్రశంసలు

by  |
కేరళకు పీఎం మోడీ ప్రశంసలు
X

న్యూఢిల్లీ : కరోనాను నిరోధించడంలో సమర్థవంతంగా పనిచేస్తున్న వ్యాక్సిన్ వృథాను అరికట్టడంలో కేరళ అత్యద్భుతంగా పనిచేస్తున్నదని ప్రధాని మోడీ కొనియాడారు. వ్యాక్సిన్ వృథాను అరికడుతున్న కేరళ వైద్య సిబ్బందిని ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. ఈ మేరకు మోడీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… ‘వ్యాక్సిన్ వేస్టేజ్‌ను అరికడుతున్న మన వైద్య సిబ్బంది, నర్సులను చూస్తే చాలా ఆనందంగా ఉంది. కొవిడ్‌పై పోరాడటంలో ఇది మన పోరాటాన్ని బలోపేతం చేస్తుంది..’ అని ట్వీట్ చేశారు. అంతకుముందు ఇదే విషయమై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ట్వీట్ చేయగా.. ప్రధాని దానిని ఊటంకిస్తూ పై విధంగా పేర్కొన్నారు.



Next Story

Most Viewed