ప్రణాళికా బద్ధంగా కాలనీల అభివృద్ధి..!

by  |
ప్రణాళికా బద్ధంగా కాలనీల అభివృద్ధి..!
X

దిశ, పటాన్‌చెరు: ప్రణాళికా బద్ధంగా మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తున్నట్లు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం పటాన్‌చెరు పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో రూ. 30 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శంకర్ యాదవ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి కాలనీలో సీసీ రోడ్లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.


Next Story

Most Viewed