రోడ్డుమీదికొచ్చి.. మూడు ముక్కలైన విమానం

by  |
రోడ్డుమీదికొచ్చి.. మూడు ముక్కలైన విమానం
X

విమానం కూలిపోతే శకలాలు దొరుకుతాయి కానీ మూడు ముక్కలెలా అయింది? అన్న అనుమానం వచ్చిందా? అవును టర్కీ లోని ఇస్తాంబుల్‌లో ఈ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఇస్తాంబుల్‌లోని సబీహ విమానాశ్రయంలో పెగాగస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 177 మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ల్యాండ్ అయింది. ఈ క్రమంలో అదుపుతప్పిన విమానం రన్‌వేను దాటి దగ్గర్లో ఉన్న రోడ్డు మీదకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో విమానం మూడు ముక్కలుగా విరిగిపోయింది. ఈ సమయంలో విమానంలోని 177 మంది ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. కొంత మందికి కుదుపుల కారణంగా స్వల్ప గాయాలయ్యాయని టర్కీ రవాణాశాఖ మంత్రి మెహ్మత్ తెలిపారు. విమానాన్ని తరలించే వరకు విమానాశ్రయంలో విమానాల రాకపోకలను నిలిపేశారు.

Next Story

Most Viewed