పొలాల్లో దిగిన జెట్

by  |

పొల్లాల్లో విమానం దిగడంతో రైతులు బిత్తరపోయిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలోని ఎరడికేర గ్రామ సమీపంలోని వ్యవసాయక్షేత్రంలో అత్యవసర పరిస్థితుల్లో ల్యాండ్ అయింది. మైసూరు నుంచి బళ్లారి జిందాల్ ఫ్యాక్టరీకి వెళ్తుండగా మార్గం మధ్యంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీనిని గుర్తించిన పైలట్ విమానాన్ని సురక్షితంగా పొలంలో ల్యాండ్ చేశారు. విమానం ల్యాండ్ అయిన సమయంలో విమానంలో పైలట్‌తో పాటు ఒక వ్యక్తి ఉన్నారు.



Next Story

Most Viewed