పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ ఆదాయం రూ. 3,302 కోట్లు

by  |
పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ ఆదాయం రూ. 3,302 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ నికర లాభం రూ. 628.31 కోట్లతో 13.95 శాతం పెరిగిందని కంపెనీ వెల్లడించింది. ఫార్మా విభాగంలో బలమైన అమ్మకాల నేపథ్యంలో లాభాలను ఆర్జించినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 551.37 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. సమీక్షించిన త్రైమాసికంలో కార్యకలాపాల ఆదాయం రూ. 3,301.84 కోట్లుగా ఉందని, గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 3,270.50 కోట్లుగా నమోదైనట్టు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ..ప్రస్తుత ఏడాది తొలి సగంలో మెరుగైన పనితీరును అందించాం. బ్యాలెన్స్ షీట్ బలోపేతం చేయడంపై దృష్టి సారించామని, గతేడాదిలో రూ. 18 వేల కోట్ల మూలధనాన్ని సాధించినట్టు కంపెనీ తెలిపింది. పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్ 1.3 శాతం తగ్గి రూ. 1,282.05 వద్ద ముగిసింది.


Next Story

Most Viewed