వికలాంగులకు చేదువార్త.. ఆ కోటా ఎత్తేసిన కేంద్రం

by  |
phc
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా ఉన్న వికలాంగులకు కేంద్రం ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సెంట్రల్ పరిధిలోకి వచ్చే ఐపీఎస్, భారత రైల్వే భద్రతా దళం (IRPFS) కేటగిరిలోని సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ విభాగాల్లోని పోస్టులకు వికలాంగుల కోటాను ఎత్తివేసింది. దీనికి సంబంధించి వికలాంగుల హక్కుల చట్టం-2016లో పలు మార్పులు చేసింది. అంతేకాకుండా, ఢిల్లీ సహా ఐదు కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని పోస్టుల నుంచి వికలాంగుల ఉద్యోగ కోటాను మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వికలాంగుల హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి.

Next Story

Most Viewed