జగిత్యాలలో కరోనా మరణం

by  |
జగిత్యాలలో కరోనా మరణం
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినా రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. జగిత్యాల జిల్లాలో కూడా కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా లక్షణాలతో జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని ఐసోలేషన్‌లో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు.

వివరాల్లోకివెళితే .. కోడిమ్యాల మండలం సండ్రాల పల్లి గ్రామానికి చెందిన 38ఏండ్ల వికలాంగుడు వైరస్‌తో చికిత్స పొందుతూ తనువు చాలించాడు. కాగా, అతని శాంపిల్స్‌ను వైద్యులు పరీక్షలకు పంపించారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచినట్లు ఆస్పత్రి సిబ్బంది వెల్లడించారు.

Next Story

Most Viewed