కీలక నిర్ణయం.. బార్లు, వైన్స్‌లలో హత్యాచార నిందితుడి ఫొటో

by Vadlamudi Anukaran |   (  Updated:2021-09-15 04:16:05  IST  )

<p>దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిని హత్యాచారం చేసిన నిందితుడి ఫొటోను బార్లు, వైన్స్‌లలో పెట్టాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి తేవాలన్నారు. చిన్నారి హత్యాచారంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. రాజకీయ ప్రముఖులు చిన్నారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. పోలీసులు నిందితుడు రాజు కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. అన్ని జిల్లా పోలీస్ బాస్‌లకు ఈ మేరకు ఆదేశాలు జారీ [&hellip;]</p>

Excise Commissioner Sarfaraz Ahmedm
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిని హత్యాచారం చేసిన నిందితుడి ఫొటోను బార్లు, వైన్స్‌లలో పెట్టాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి తేవాలన్నారు. చిన్నారి హత్యాచారంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. రాజకీయ ప్రముఖులు చిన్నారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. పోలీసులు నిందితుడు రాజు కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. అన్ని జిల్లా పోలీస్ బాస్‌లకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

Next Story