ఐసీఐసీఐతో జతకట్టనున్న ఫోన్ పే

by  |
ఐసీఐసీఐతో జతకట్టనున్న ఫోన్ పే
X

ఫోన్ పే వినియోగదారులకు గుడ్ న్యూస్. యస్ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించటంతో ఆ బ్యాంకుతో భాగస్వామిగా ఉన్న ఫోన్ పే సేవలు గత రెండు రోజుల నుంచి నిలిచిపోయాయి. అయితే వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సేవల పునరుద్ధరణకు ఫోన్ పే సంస్థ ముమ్మర ప్రయత్నాలు చేసింది. యస్ బ్యాంకు స్థానంలో ఐసీఐసీఐ బ్యాంకుతో జత కట్టాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఫోన్ పే సంస్థ ముఖ్య కార్య నిర్వహణ అధికారి సమీర్ నిగమ్ అధికారికంగా వెల్లడించారు. అత్యవసర సమయాల్లో ఆదుకున్నందుకు ఐసీఐసీఐ బ్యాంకుకు కృతజ్ఞతలు తెలిపారు.

tag; phonepe, icici, yes bank, national news


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed