దాతృత్వం చాటుకున్న మంత్రి జగదీష్ రెడ్డి

by  |
దాతృత్వం చాటుకున్న మంత్రి జగదీష్ రెడ్డి
X

దిశ, నల్లగొండ: రంజాన్ పర్వదినోత్సావాన్ని పురస్కరించుకుని 5 వేల కుటుంబాలకు చెందిన ముస్లిం సోదరులకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తోఫా రూపంలో పండుగ కానుక ప్రకటించారు. సొంత నిధులతో ఐదు వేల మందికి డ్రై ఫ్రూట్స్ తో సహా పది రకాల నిత్యావసర సరుకులు ప్రతి ముస్లిం సోదరుల కుటుంబాలకు స్వయంగా మంత్రి జగదీష్ రెడ్డి అందజేశారు. శనివారం ఉదయం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ముస్లింలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్, జెడ్పీటీసీ జీడీ భిక్షం, ఎంపీపీ రవీందర్ రెడ్డి, జిల్లా టిఆర్ఎస్ నాయకులు గుండూరు ప్రకాష్, కౌన్సిలర్లు ఆకుల లవకుశ, అభినయ్, రియాజ్ తోపాటు ఇతర నేతలు పాల్గొన్నారు.

Next Story