వామ్మో పెట్రోల్ ధరలు.. షాక్‌లో వాహనదారులు

by Shamantha N |

<p>దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు పెట్రోల్ ధరలు పెరుగుతూ వాహనదారులకు షాకిస్తున్నాయి. తాజాగా శుక్రవారం మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ పై 35 పైసలు, లీటర్‌ డీజిల్‌ పై 35 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.64 కు చేరగా డీజిల్ ధర రూ. 97.37 గా ఉంది. ఇక వాణిజ్యనగరమైన ముంబై‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 114.47 కు చేరగా [&hellip;]</p>

వామ్మో పెట్రోల్ ధరలు.. షాక్‌లో వాహనదారులు
X

దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు పెట్రోల్ ధరలు పెరుగుతూ వాహనదారులకు షాకిస్తున్నాయి. తాజాగా శుక్రవారం మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ పై 35 పైసలు, లీటర్‌ డీజిల్‌ పై 35 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.64 కు చేరగా డీజిల్ ధర రూ. 97.37 గా ఉంది. ఇక వాణిజ్యనగరమైన ముంబై‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 114.47 కు చేరగా డీజిల్ ధర రూ. 105.49 కు పెరిగింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు పెరుగుతూ వాహనదారులకు చుక్కలు చూపెడుతున్నాయి. పెరిగిన ధరలతో హైదరాబాద్ నగరం‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.59 కు చేరగా డీజిల్ ధర రూ. 105. 84 కు పెరిగింది. ఇక ఏపీ‌లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 115. 35 కు చేరగా డీజిల్ ధర రూ. 107.87 కు చేరుకుంది.

Next Story