21వ రోజు పెరిగిన పెట్రోల్ ధరలు

by  |
21వ రోజు పెరిగిన పెట్రోల్ ధరలు
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో ప్రజలు కరోనాతో అల్లాడుతుంటే చమురు కంపెనీలు రోజురోజుకు పెట్రోల్ ధరలను పెంచుతున్నాయి. వరుసగా నేడు 21వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 25 పైసలు, డీజిల్ పై 21 పైసలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 80.38, లీటర్ డీజిల్ ధర 80.40 కు చేరుకుంది. దీంతో 21 రోజుల్లో డీజిల్ పై మొత్తం 10.27 రూపాయలు, పెట్రోల్ పై 9.18 రూపాయలు పెరిగాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.



Next Story

Most Viewed