- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ : ఢిల్లీలోని షహీన్బాగ్ సీఏఏ వ్యతిరేక ఆందోళనకారుల ప్రదర్శన శిబిరంపై ఆదివారం ఉదయం దుండగులు పెట్రోల్ బాంబు విసిరారు. కనీసం ఒకరిద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి పెట్రోల్ బాంబును విసిరేసి పారిపోయినట్టు స్థానికులు తెలిపారు. ఘటన అనంతరం స్పాట్కు చేరుకున్న పోలీసులు.. ఐదారు పెట్రోల్ నింపిన బాటిళ్లను కనుగొన్నట్టు వివరించారు. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేవని సమాచారం. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో షహీన్బాగ్లో ఆందోళన విరమించాలని పలువురు సూచించారు. ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని ఇచ్చిన పిలుపునూ ఆందోళనకారులు ఆచరించలేదు. సామాజిక దూరాన్ని పాటిస్తూ ఆందోళన కొనసాగిస్తామని వారు తెలిపారు. తాజాగా, ఈ దుర్ఘటన జరిగింది.
Tags: shaheenbagh, protest, petrol bomb, attack, curfew day
Next Story