- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వామన్రావు దంపతుల హత్య కేసును సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో శుక్రవారం వామన్రావు తండ్రి గట్టు కిషన్ రావు పిటిషన్ వేశారు. జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అక్రమాలు ప్రశ్నించినందుకే వామన్ రావు హత్య చేసినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసుపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడం లేదని కిషన్ రావు తెలిపారు.
ఈ నెల 17వ తేదీన హైకోర్టు న్యాయవాది వామన్రావు, ఆయన భార్య నాగమణిని దుండుగులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. రామగిరి మండల సమీపంలో వామన్రావు కారును మరో కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు అడ్డగించి.. వారిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో దంపతులిద్దరు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వీరిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. వామన్ రావు దంపతుల హత్య కేసులో ఏ4 నిందితుడు బిట్టు శ్రీనును కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.