- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, క్రైమ్ బ్యూరో:
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రిమాండ్లో ఉన్న మల్కాజిగిరి ఏసీపీ నరసింహరెడ్డిని ఐదు రోజుల కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు శనివారం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ సర్వీసులో ఉండి అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం రావడంతో ఏసీపీ నరసింహారెడ్డికి సంబంధించిన బంధువులు, బినామీ ఇళ్లల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ అధికారులు ఏకకాలంలో 25 ప్రాంతాల్లో సోదాలు జరిపారు.
ఈ సోదాల్లో దాదాపు రూ.100 కోట్లకు పైగా ఏసీపీ నరసింహారెడ్డి కూడబెట్టినట్టుగా ఏసీబీ గుర్తించింది. దీంతో కోర్టుకు రిమాండ్ చేసి, జైలుకు తరలించగా, ఏసీపీ అవినీతి అక్రమాలు, వ్యాపారాలు, బినామీలు, లాకర్లు తదితర అంశాలపై మరింత లోతుగా విచారించేందుకు ఏసీబీ కస్టడీ కోరుతూ పిటీషన్ దాఖలు చేసింది. ఈ కస్టడీ పిటీషన్ పై కోర్టు త్వరలో తీర్పు చెప్పనుంది. ఈ మేరకు ఏసీపీ నరసింహారెడ్డిని ఏసీబీ కస్టడీకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.