అశ్వదా వృక్షంపై హైకోర్టులో పిటిషన్

by  |
అశ్వదా వృక్షంపై హైకోర్టులో పిటిషన్
X

దిశ, ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట‌ సమీపంలో ఉన్న200 ఏళ్ల‌ చరిత్ర కలిగిన హనుమాన్ ఆలయంలోని అశ్వదా వృక్షంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వృక్షాన్ని తొలగించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలి పిటిషన్‌లో తెలంగాణ వాన‌ర‌సేన సంస్థ పేర్కొంది. దేవాల‌యం ప్ర‌భుత్వ ప‌రిధిలో లేద‌ని, వైటీడీఏ కౌంట‌ర్ దాఖ‌లు చేస్తుందని దేవాదాయ‌శాఖ త‌ర‌పు న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. ఆర్డీవో నివేదిక‌ ప్రకారం ప్ర‌తిపాదిత రింగ్‌రోడ్‌కు ఆల‌యం, అశ్వదావృక్షం అడ్డురాద‌ని స్ప‌ష్టంగా ఉందన్న హైకోర్టు వ్యాఖ్యానించింది.

అలాంటప్పుడు కూల్చే ప్ర‌శ్నే ఉత్ప‌న్నం కాదు క‌దా అని ఏజీని కోర్టు ప్ర‌శ్నించింది. ప్ర‌తిపాదిత రింగ్ రోడ్ మ్యాప్ పై ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాసిన లేఖను సమ్పరించాలని హైకోర్టు అదేశించింది. తదుపరి విచార‌ణ ను ఈ నెల 27కి వాయిదా వేసింది హైకోర్టు.


Next Story

Most Viewed