NEET, JEE పరీక్షలపై మంత్రుల పిటిషన్

by  |
supreme court notices to twitter
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్నందున NEET, JEE పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు, విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా బీజేపీయేతర ప్రభుత్వాలకు చెందిన ఆరుగురు మంత్రులు ఈ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పరీక్షల నిర్వహణపై ఇచ్చిన తీర్పును పున సమీక్షించి పరీక్షలను వాయిదా వేయాలని వారు ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.

కాగా, షెడ్యూల్ ప్రకారమే JEE, NEET పరీక్షలు నిర్వహిస్తామని, కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను పెంపుతో పాటు కొవిడ్ జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహిస్తామని కేంద్రం వెల్లడించిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed