ఇళ్ల స్థలాలపై హైకోర్టులో పిటిషన్​ !

by  |
ఇళ్ల స్థలాలపై హైకోర్టులో పిటిషన్​ !
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో పేదలకిచ్చే ఇళ్ల స్థలాలపై ఇప్పటికే కేసులు నడుస్తుండగా లేటెస్ట్‌గా గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో సేకరించిన ఇళ్ల స్థలాలపై సోమవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. బుడంపాడు- నారాకోడూరు మధ్య 32ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే ఇళ్ల నిర్మాణానికి పనికిరాని పల్లపు స్థలాన్ని కొనుగోలు చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదేక్రమంలో భూమిని అధిక ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసిందని మన్నే శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించగా, రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.


Next Story

Most Viewed