పెంపుడు పిల్లికి కరోనా.. ఆందోళనలో యజమానులు

by  |
పెంపుడు పిల్లికి కరోనా.. ఆందోళనలో యజమానులు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి చైనాలో పట్టింది. అయితే దీని పుట్టుకకు అనేక మంది వైద్యులు, శాస్త్రవేత్తలు అనేక కారణాలు చెప్పారు. తాజాగా బ్రిటన్‌లోని ఓ పెంపుడు పిల్లిలో కొవిడ్-19 కి కారణమైన వైరస్ మొదటిసారిగా కనుగొన్నారు. అయితే పెంపుడు జంతువు యజమానులకుగానీ, ఇతర జంతువులకుగానీ వైరస్ వ్యాప్తి చెందినట్టు ఆధారాలు లేవని పశు వైద్యాధికారులు తెలిపారు. ఈ నెల 22 న వెయిబ్రిడ్జ్‌లోని యానిమల్ అండ్ ప్లాంట్ హెల్త్ ఏజెన్సీ ప్రయోగశాలలో పరీక్షలు జరిపిన అనంతరం ఈ సంక్రమణను నిర్ధారించారు. పెంపుడు జంతువులను కలిగివున్నవారు కూడా వాటిని ముట్టుకున్నప్పుడల్లా క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలని ఆరోగ్య అధికారులు సూచిస్తున్నారు.

పిల్లికి దాని యజమానుల ద్వారానే కరోనా వైరస్ సంక్రమించిందని కొవిడ్-19 పరీక్షల్లో తేలింది. ప్రస్తుతం పిల్లితోపాటు దాని యజమానులు కూడా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారు.

Next Story

Most Viewed