ప్రకాశం బ్యారేజిపై నుంచి దూకి వ్యక్తి సూసైడ్..

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-09-25 08:30:32  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని విజయవాడలో దారుణం జరిగింది. ప్రకాశం బ్యారేజిపై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి రాగా, స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే సూసైడ్ నోట్ రాసి యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు [&hellip;]</p>

ప్రకాశం బ్యారేజిపై నుంచి దూకి వ్యక్తి సూసైడ్..
X

దిశ, వెబ్‌డెస్క్ :

ఏపీలోని విజయవాడలో దారుణం జరిగింది. ప్రకాశం బ్యారేజిపై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి రాగా, స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే సూసైడ్ నోట్ రాసి యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.

మృతుడు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కృష్ణలంక పోలీసులు తెలిపారు. కాగా, ప్రకాశం బ్యారేజి వద్ద బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Next Story