- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో దారుణం జరిగింది. బీచ్ రోడ్డులోని ఓ అపార్టుమెంటులో స్నేహితుల మధ్య తలెత్తిన చిన్న వివాదం చిలికిచిలికి గాలివానలా మారడంతో పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్నారు. అయితే, వీరంతా మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో గోపాలకృష్ణ అనే యువకుడిని బ్రహ్మాజీ అనే తోటి స్నేహితుడు కత్తితో పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇతనిది పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం గ్రామం. మృతుడు విశాఖలోని ఓ కంపెనీలో సివిల్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని దాడికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story