ఒకే మహిళతో ఇద్దరి అక్రమ సంబంధం.. కత్తులతో నరికి..!

by  |
Murder
X

దిశ, చార్మినార్​ : ఫలక్‌నుమాలో సంచలనం సృష్టించిన షేక్​అబ్బాస్​హత్య కేసు మిస్టరీని ఎట్టకేలకు స్థానిక పోలీసులు ఛేదించారు. తాను సంబంధం పెట్టుకున్న మహిళతోనే షేక్​ అబ్బాస్ కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న నెపంతో అతనిపై కత్తితో దాడి చేసి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు యువకులను ఫలక్‌నుమా పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. సీఐ దేవేందర్​కథనం ప్రకారం.. గుల్జార్​నగర్​మదీనా మసీదు ప్రాంతానికి చెందిన షేక్ అబ్బాస్​(22) జీహెచ్ఎంసీలో కాంట్రాక్ట్​ పద్ధతిలో ఎలక్ర్టిషన్​ గా విధులు నిర్వహించేవాడు.

షేక్​అబ్బాస్‌కు మూడు నెలల కిందట ఓ యువతితో వివాహం జరిగింది. ఈ నెల 1న రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన అబ్బాస్​ఫోన్​ వచ్చిందని ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. కేవలం10 నిమిషాల వ్యవధిలోనే అతనిపై కత్తులతో దాడి చేశారని కుటుంబ సభ్యులకు తెలిసింది. తీవ్రంగా గాయపడిన అబ్బాస్​చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. మృతుని తల్లి ఖాదర్​బీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫలక్‌నుమా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తుండగా అచ్చిరెడ్డి నగర్‌కు చెందిన మహ్మద్​పర్వేజ్(23), నవాబ్​సాహెబ్​కుంటకు చెందిన షేక్ అక్రమ్ (24)లు షేక్​అబ్బాస్​పై కత్తితో దాడి చేసి హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు.

వివాహేతర సంబంధమే కారణం..

నిందితుడు మహ్మద్​పర్వేజ్‌కు గత ఏడేండ్లుగా ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇదిలా ఉండగా మృతుడు షేక్​అబ్బాస్​ కూడా సదరు మహిళతోనే 18 నెలల నుంచి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. మహిళతో షేక్​అబ్బాస్​సన్నిహితంగా ఉంటున్న విషయాన్ని మహ్మద్​పర్వేజ్​కొంతకాలంగా గమనిస్తూ వచ్చాడు. అబ్బాస్‌తో దూరంగా ఉండాలని మహిళను మహ్మద్​పర్వేజ్​హెచ్చరించాడు. వారిద్దరి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవడంతో షేక్​అబ్బాస్‌ను ఎలాగైనా మట్టుబెట్టాలని షేక్​అక్రమ్‌తో కలిసి హత్యకు కుట్రపన్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాత్రి షేక్​అబ్బాస్‌కు ఫోన్​చేసిన మహ్మద్​పర్వేజ్, షేక్​అక్రమ్‌లు ఇంటి నుంచి బయటికి రాగానే ఓ కిరాణా జనరల్​ స్టోర్​వద్ద అడ్డగించి కత్తులతో దాడి చేసి పరారైనట్టు విచారణలో తేలింది.



Next Story

Most Viewed